Telugu Poems


  అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ.



శ్రీమధ్భాగవతము - గజేంద్ర మోక్షము
పద్యం
కలడందురు దీనుల యెడ
కలడందురు పరమయోగి గణములపాలం,
గలడందు రన్ని దిశలను,
గలడు గలం డనెడివాడు గలడో? లేడో?



తాత్పర్యం


దీనుల యెడ ఉన్నారంటారు,
పరమ యోగులందూ ఉన్నాడంటారు,
నాల్గు దిక్కుల్లోనూ ఉన్నాడంటారు,
"ఉన్నాడు ఉన్నాడు" అనేవాడసలు ఉన్నాడో? లేడో?
మనిషికి సందేహముండరాదు. ఆ సందేహమే మనిషిని కాకుండా, అతనిపని యేదీ కాకుండా చేస్తుంది.
గజేంద్రుని సందేహం వలనే ఈశ్వరుడు అతని రక్షణకు రాలేక పోయాడన్న విషయాన్ని యీ పద్యం ముఖాన మహాకవి సందేశమిచ్చాడు.

 
వేమన పద్యం:

             అంతరంగమందు  నపరాధములు చేసి
             మంచి వానివలెనె  మనుజుడుండు
             ఇతరులెఱుగుకున్న  నీశ్వరుడెఱుగడా?
             విశ్వదాభిరామ వినురవేమ..!
 తాత్పర్యం: 
మనుజడు తనలోని భావములను ఎన్ని దాచుకొన్నను సర్వాంతర్యామియయిన  భగవంతుని ముందు  దాచలేడు కదా! 


                ఆపదైనవేళ నరసి బందుల జూడు
                భయమువేళ జూడు బంటు తనము
                 పేదవేళ జూడు పెండ్లాము గుణము
                విశ్వదాభిరామ వినురవేమా !

                తల్లియున్నయపుడే తనదు గారాబము
                లామె పోవదన్ను నరయరెవరు
                మంచి కాలమపుడె మర్యాదనార్జింపు
                విశ్వదాభిరామ వినుర వేమ. 

తాత్పర్యం:
కాలం కలిసి వచ్చినప్పుడే గౌరవమర్యాదలు ఆర్జించుకోవలెను.
లేనపుడు ఎందుకూ కొరగారు.అది ఎట్లన తల్లి బ్రతికియున్నప్పుడే గారము సాగినట్లు.

Comments

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4